నెల్లూరు, సెప్టెంబర్ 14, 2026:
నెల్లూరు రూరల్ పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన గొలగమూడి భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి ఆలయాన్ని సోమవారం అఖిల భారత్ హిందూ మహాసభ (ABHM) ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు శ్రీ అప్పారాజు జనార్ధనరావు శర్మజీ దర్శించుకున్నారు.
వేకువజామున 4 గంటలకు ఆలయానికి చేరుకున్న ఆయన స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజలు, అభిషేక సేవల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. “ఓం నారాయణ… ఆది నారాయణ” నామస్మరణతో మారుమ్రోగిన ఆలయ ప్రాంగణంలో భక్తులతో కలిసి కొద్దిసేపు ధ్యానం చేశారు.
సనాతన ధర్మ సేవ, అన్నదాన కార్యక్రమాల విస్తరణే లక్ష్యం
సనాతన ధర్మ పరిరక్షణ, ప్రచారం, ఆలయ సేవా కార్యక్రమాలు మరియు అన్నదాన కార్యక్రమాలను మరింత విస్తరించే అంశాలపై ఆలయ అర్చకులు, వేద పండితులతో శర్మజీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సనాతన ధర్మ సేవకు సంబంధించిన పలు అంశాలపై చర్చించి, వేద పండితులు మరియు అర్చకుల ఆశీస్సులు స్వీకరించారు.
అనంతరం ఆలయంలో నిరంతరాయంగా నిర్వహిస్తున్న ఉచిత అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులు, స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నప్రసాదం సక్రమంగా అందేలా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.
భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి కృపతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శాంతి సమృద్ధులతో జీవించాలని శ్రీ అప్పారాజు జనార్ధనరావు శర్మజీ ఆకాంక్షించారు.




